ఎమ్ ఎండలారా బాబు తెలంగాణాలో వడదెబ్బకు ఒక్కరోజులో 37 మంది చనిపోయారు
ఎండ వేడిమి తట్టుకోలేక జనం పిట్లల్లా రాలిపోతున్నారు. మే 26న థార్లో 43.3 డిగ్రీలు కాగా, హైదరాబాద్లో అంతకంటే ఎక్కువగా ఉష్ణోగ్రత నమోదైంది.అర్ధరాత్రి 12 గంటలైనా వాతావరణం చల్లబడటం లేదు. పెద్దపల్లి జిల్లాలో ఐదుగురు,సూర్యాపేట జిల్లాలో ముగ్గురు, నల్లగొండ జిల్లాలో ముగ్గురు, కరీంనగర్ జిల్లాలో ముగ్గురు, సిరిసిల్ల, కుమరంభీం జిల్లాల్లో ఒకరు, భద్రాద్రి జిల్లాలో ఐదుగురు, ఖమ్మం జిల్లాలో ముగ్గురు, జనగామ జిల్లాలో ముగ్గురు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఇద్దరు, ములుగు జిల్లాలో ఇద్దరు,యాదాద్రి భువనగిరి జిల్లాలో నలుగురు, నాగర్కర్నూలు, రంగారెడ్డి జిల్లాల్లో ఇద్దరు వడదెబ్బతో అస్వస్థతకు గురై చనిపోయారు.
Post a Comment