విద్యార్థులకు ప్రతి శనివారం నో బ్యాగ్ డే ఎక్కడో తెలుసా
అందుతున్న సమాచారం ప్రకారం శనివారం నో బ్యాగ్ డే నిర్వహించాలని భావిస్తున్నారు.నవ్యాంధ్ర రెండవ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకునే ప్రతి నిర్ణయం వినూత్నంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.దీంతో పాటు ప్రతిరోజు అరగంట ఆనంద వేదిక తరగతులు నిర్వహణకు కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. జూన్ 3న గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలు, విద్యావేత్తలతో పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి ఈ కార్యక్రమ అమలుపై వారి సూచనలు, సలహాలను తీసుకోనున్నారు.

Post a Comment