రూ.6.95 కోట్లు
లగ్జరీ కార్ల తయారీ కంపెనీ రోల్స్ రాయిస్ గురువారం భారత మార్కెట్లోకి తన తొలి ఎస్యువి 'కులినన్'ను విడుదల చేసింది. దీని ధరను రూ.6.95 కోట్లుగా నిర్ణయించామని ఆ కంపెనీ ప్రతినిధి డేవిడ్ కిమ్ తెలిపారు. గతేడాది తమ అమ్మకాలు తగ్గాయని.. ఈ కారు ద్వారా భారత్లో వృద్ధి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. గతేడాది ప్రపంచ వ్యాప్తంగా తాము 4,107 యూనిట్లను విక్రయించామన్నారు.దీన్ని డిజైన్, అభివృద్ధి చేయడానికి చాలా ఏళ్ల సమయం పట్టిందన్నారు.
Post a Comment